
మల్లన్నసాగర్ ఇష్యూలో విపక్షాలన్నీ ఏకమైన తెలంగాణ సర్కారుకు షాకిస్తున్న వేళ.. ఈ వివాదానికి తెర దించేందుకు మంత్రి హరీశ్ స్వయంగా నడుం బిగించారు. తమ భూములకు తగిన పరిహారం ఇచ్చే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న గ్రామాల వారితో వేర్వేరుగా భేటీ అయి.. వారి సమస్యల్ని అసాంతం విని.. వారి మనసుకు నచ్చేలా నిర్ణయాల్ని వెలువరించేందుకు హరీశ్ ప్రత్యేక కసరత్తు చేశారు. అదే సమయంలో.. ముంపు గ్రామాల్లో పర్యటించటం ద్వారా నిరసల్ని మరింత రాజేసేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాల్ని అరెస్ట్ లతో అడ్డుకొన్న తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు బాధితుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
ఇంతకాలం ఎనిమిది ముంపు గ్రామాల్లో ఆరు గ్రామాల్ని ఒప్పించిన మంత్రి హరీశ్..తాజాగా మరో ఊరును ఒప్పించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూముల్ని తీసుకోవటంతో పాటు.. ముంపునకు గురయ్యే గ్రామాన్ని తిరిగి అదే పేరుతో వేరుగా కట్టిస్తామన్న హామీతో ఇష్యూ పరిష్కారమైంది. తాజా ఒప్పుకున్న సింగారం గ్రామస్తులతో..ఇక వేములఘాట్ ఒక్కటే మిగిలింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భూములుసేకరించాల్సిన ఎనిమిది గ్రామాల్లో ఏడు గ్రామాలకు చెందిన వారు ఓకే అనటంతో వేముల ఘాట్ ను ఒప్పిస్తే మల్లన్నసాగర్ మీద రచ్చ ముగిసినట్లే. తాజా పరిణామం హరీశ్ కు మరింత ఉత్సాహానిస్తుందనటంతో సందేహం లేదు.
No comments:
Post a Comment